యే ఎండకు ఆ గొడుగు పట్టిన టీటీడీ ప్రధానార్చకుల .



ఏపీ ఎన్నికల్లో చరిత్రాత్మక విజయం సాధించిన వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పండితులు ఆశీర్వచనాలు ఇచ్చారు. శుక్రవారం (మే 24) గుంటూరు జిల్లా తాడేపల్లిలోని నివాసంలో జగన్‌ను టీటీడీ ఈవో అశోక్‌ కుమార్‌ సింఘాల్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆలయ ప్రధానార్చకులు, వేదపండితులు జగన్‌కు ఆశీర్వచనాలు ఇచ్చి.. శ్రీవారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు.

వైఎస్ జగన్‌కు ఇటు విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం కూడా ఆశీస్సులు అందించింది. తాడేపల్లిలోని నివాసంలో జగన్‌ను కలిసిన ఆలయ వేద పండితులు.. అమ్మవారి తీర్థప్రసాదాలు, మొమొంటోను అందించారు..

బెజవాడ కనకదుర్గ ఆలయ ఈవో కోటేశ్వరమ్మ జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని.. భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని జగన్‌ చెప్పినట్లు ఈవో వెల్లడించారు.
ఏపీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లతో తిరుగులేని మెజార్టీ సాధించిన విషయం తెలిసిందే. అధికార టీడీపీ 23 సీట్లకే పరిమితమైంది. టీడీపీ స్థాపించిన తర్వాత ఈ స్థాయిలో పరాజయం పొందడం ఇదే తొలిసారి. ఫ్యాన్ ప్రభంజనంలో అటు మార్పు కోసం అంటూ రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కూడా కొట్టుకుపోయింది. ఆ పార్టీ ఒకే ఒక స్థానంలో విజయం సాధించింది.

Comments

Popular Posts